ఎంపీ సుమలత సంచలన నిర్ణయం, ఆ సీన్ రిపీట్ అవుతుందని నాయకుల్లో భయం ?

లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జేడీఎస్ నేతలకు మండ్య ఎంపీ సుమలత అంబరీష్ నిర్ణయం పెద్ద తలనొప్పిగా మారింది. మండ్య నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు. మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ తదుపరి నిర్ణయం విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకుల్లో గందరగోళం నెలకొంది.

ఈ విషయమై బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సుమలత ఏప్రిల్ 3వ తేదీన మండ్యలో తుది నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు చాలెంజింగ్ స్టార్ దర్శన్ తతోనే ఉంటాడని, మండ్య జిల్లాకు చెందిన మా మద్దతుదారులు, అంబరీష్ అభిమానులు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలను పంచుకున్నారని, ఎన్నికల తేదీకి ముందే ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తదుపరి చర్య తీసుకుంటానని, ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తానని సుమలత అన్నారు.

Sumalatha is ready to contest as an independent party candidate in Mandya

మా స‌న్నిహిత వ‌ర్గాలతో చ‌ర్చిస్తామని, అంబరీష్ అభిమానులతో చర్చించి మండ్యలోనే తన తుది నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తాన‌ని సుమలత చెప్పారు. సుమలత అసలు మ్యాటర్ చెప్పకుండా తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అంటున్నారు. సుమలతతో భేటీ అయ్యి ఆమె మద్దతు కోరుతామని ఇప్పటికే మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. అంబరీష్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని వాళ్ల అభిప్రాయం తెలుసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటానని సుమలత అంటున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో సుమలతకు మద్దతుగా శ్యాండిల్ వుడ్ హీరోలు దర్శన్, కేజీఎఫ్ హీరో యష్ మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు. తన నిర్ణయాన్ని తరువాత ప్రకటిస్తానని అంటున్న సుమలత ఈసారి కూడా హీరో దర్శన్‌ తనతోనే ఉంటాడని, తనకే మద్దతు ఇస్తాడని ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమలత మాటలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ మా నియోజకవర్గాన్ని నిలబెట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం అని సుమలత అన్నారు.

బీజేపీ నేతలు కూడా తనకు మండ్య సీటు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నించారని తనకు తెలుసు అని సుమలత అన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ తీసుకున్న నిర్ణయంలో మన భవిష్యత్తు ఏంటి? మమ్మల్ని నమ్ముకున్న వాళ్ల గతి ఏంటి అని సుమలతను ఆమె మద్దతుదారులతో ప్రశ్నించారని తెలిసింది. బీజేపీ నేతలతో మాట్లాడినప్పుడు కూడా తన భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని, నన్ను నమ్ముకున్న అభిమానులను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని సుమలతా అంబరీష్ అన్నారని సమాచారం.

అయితే రోజురోజుకు సుమలత తీరుతో విసిగిపోతున్న బీజేపీ, జేడీఎస్ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వేచి చూడాలని ఆ పార్టీల కార్యకర్తలు అంటున్నారు. మండ్యలో మరోసారి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని ఆదివారం రాత్రి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. మండ్యలో సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ ప్రభావం మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిపై పడే అవకాశం ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+