జయ ఎఫెక్ట్: పడిపోయిన సన్ టీవీ స్టాక్స్
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని పాలక అన్నాడియంకె విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో సన్ టీవీ స్టాక్స్ పతనమయ్యాయి. డిఎంకె అన్నాడియంకెపై ఆధిపత్యం సాధించలేని భయం స్టాక్స్పై పడింది. తమిళనాడు శానససభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో సన్ టీవీ స్టాక్స్ బిఎస్ఈలో 7 శాతం పడిపోయింది.
పతనం విలువ గురువారం ఉదయం 9.20 గంటలకు రూ.396.95 ఉంది. ఎన్ఎస్ఈపై కూడా దాని ప్రభావం కనిపించింది. సన్ స్టాక్ ఎన్ఎస్ఈలో 6.3 శాతం పడిపోయి రూ.401.45 కు చేరుకుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల నేపథ్యంలో సన్ టీవీ స్టాక్లో తొలుత పెరుగుదల కనిపించింది.

అయితే, పావు గంటలోనే సన్ టీవీ స్టాక్ పతనదిశగా సాగడం ప్రారంభమైంది. సన్ టీవీ డిఎంకె అధినేత కరుణానిధి మేనళ్లుల్లు మారన్ సోదరులకు చెందిందనే విషయం తెలిసిందే.
కాగా, సన్ టీవీకి ప్రత్యర్థిగా భావించే రాజ్ టెలివిజన్ నెట్ వర్క్ లిమిటెడ్ స్టాక్ బిఎస్ఈలో ఉదయం 9.20 గంటలకు 17 సాతం పెరిగి రూ. 71,80కు చేరుకుంది. ఈ టీవీ చానెల్కు అన్నాడియంకెతో గానీ డిఎంకెతో గానీ సంబంధం లేదు. ఎన్ఎస్ఈలో రాజ్ టీవీ స్టాక్ 18 శాతం పెరిగి రూ.71.60కి చేరుకుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications