సునంద హత్య: శశి థరూర్ కు లైడిటెక్టర్ పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించి అసలు విషయాలు బయటకు లాగాలని దర్యాప్తు చేస్తున్న అధికారులు భావించారు.
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కు లైడిటెక్టర్ పరిక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారని తెలిసింది. శశి థరూర్ భార్య సునంద పుష్కర్ విష ప్రయోగంతోనే మృతి చెందారని ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు దృవీకరించిన విషయం తెలిసిందే.
సునంద పుష్కర్ హత్య కేసులో కీలక వ్యక్తులను మరోసారి విచారించాలని ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారు. శశి థరూర్ కుటుంబ స్నేహితుడు సంజయ్ దేవన్, డ్రైవర్ బజరంగి, సహాయకుడు నరైన్ సింగ్, సునందను పరిక్షించిన వైద్యుడిని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.

సునంద పుష్కర్ మరణించిన రోజు ఆమె గదిలో అల్ప్రాక్స్ టాబ్లెట్లు లభించాయి, లోధీ కాలనీలోని కెమిస్ట్ లను పోలీసులు విచారించి వివరాలు సేకరించారు. అల్ప్రాక్స్ టాబ్లెట్ల విష ప్రభావంతో సునంద పుష్కర్ మరణించిందని వైద్య నివేదికలో వెలుగు చూసింది.
సునంద పుష్కర్ కు ఎవరు అల్ప్రాక్స్ టాబ్లెట్లు తీసుకు వచ్చి ఇచ్చారు, ఎక్కడ కొనుగోలు చేశారు తదితర విషయాలు బయటకు లాగాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇదే సందర్బంలో అతి త్వరలో శశి థరూర్ కు లైడిటెక్టర్ పరిక్షలు నిర్వహించాలని ఢిల్లీ పోలీసు అధికారులు నిర్ణయించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications