రాజీవ్ హత్య: దోషుల ఉరిశిక్ష జీవిత ఖైదుగా మార్పు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమైనందున తమ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
సుప్రీం తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన శాంతన్, మురుగన్, పెరారీవాలన్ మరణ శిక్షకు బదులుగా జీవిత ఖైదును అనుభవించనున్నారు. క్షమాభిక్ష పిటీషన్లను ఆలస్యం చేయడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. క్షమాభిక్ష పిటీషన్లపై రాష్ట్రపతి తీసుకునే నిర్ణయంపై ప్రభుత్వం కొంత సమయం కేటాయించే విధంగా చూడాలని కోర్టు అభిప్రాయపడింది.

క్షమాభిక్షపై తీసుకునే నిర్ణయం ఆలస్యమయ్యే విధంగా ఉంటే నిందితులకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చే విధంగా చూడాలని సూచించింది. కాగా రాజీవ్ హత్య కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
క్షమాభిక్ష పిటీషన్పై ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే నిందితులకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించినట్లు కోర్టు పేర్కొంది. కాగా సుప్పీం తీర్పు పట్ల నిందితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications