Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీధి కుక్కలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

దేశవ్యాప్తంగా వీధి కుక్కలు, రహదారులపై తిరిగే పశువుల విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు.. క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలను వీధి కుక్కల రహిత ప్రాంగణాలుగా మార్చాలని స్పష్టం చేసింది. ఒక జాయింట్ డ్రైవ్ నిర్వహించి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని న్యాయస్థానం వెల్లడించింది. గతంలో రేబిస్‌ లక్షణాలు లేని కుక్కలను తిరిగి వదిలివేయచ్చని అనుమతించగా, ఇప్పుడు మాత్రం అవి మళ్లీ రోడ్లపైకి రాకుండా శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇటీవల వీధి కుక్కలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే జంతువుల కారణంగా ప్రమాదాలు, దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనల నేపధ్యంలో ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటూ ఈ తీర్పు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. కుక్కలను తరలించిన తర్వాత వాటికి తగిన ఆహారం, నీరు, వైద్యసదుపాయాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తీసుకుంటాయని కోర్టు తెలిపింది.

supreme-court-given-sensational-verdict-on-stray-dogs

అలాగే కుక్కల కోసం ప్రత్యేక "ఫీడింగ్ జోన్‌లు" ఏర్పాటు చేయాలని సూచించింది. బహిరంగంగా ఆహారం ఇవ్వడం నిషేధమని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి పశువులను తక్షణమే పట్టుకుని షెల్టర్ హోమ్‌లకు తరలించాలని, వాటి సంరక్షణకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్ఏఐ (NHAI), స్థానిక సంస్థలు 8 వారాల్లోపు అమలు చేయాలని స్పష్టంచేసింది.

కాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో రేబిస్‌ మరణాలు పెరుగుతున్నాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని, గత ఆగస్టు 11న జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్‌ల ధర్మాసనం వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో కొత్త త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి ఇప్పుడు మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 13, 2026కు వాయిదా వేసింది. అప్పటివరకు అన్ని రాష్ట్రాలు కోర్టు ఆదేశాలను అమలు చేసిన పురోగతి వివరాలను సమర్పించాలని సూచించింది. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా వీధి జంతువుల నియంత్రణలో కొత్త దశ ప్రారంభం కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+