ఏపీ, తెలంగాణ టీచర్ల నియామకంలో ఆలస్యంపై విచారణ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీచర్ల నియామకంలో జరిగిన ఆలస్యంపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ మేరకు సోమవారం నాడు మరోసారి విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. అయితే ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన చీఫ్ సెక్రటరీలు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్కే జోషి న్యాయస్థానంలో అఫిడవిట్లు దాఖలు చేశారు. టీచర్ల ఖాళీల భర్తీ అంశంతో పాటు స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పనపై వివరించారు.
ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెల 4వ తేదీ లోపు టీచర్ల నియామకాన్ని పూర్తి చేస్తామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాకుండా స్కూళ్లల్లో మౌలిక వసతులకు సంబంధించి కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అదలావుంటే ఆరు నెలల్లోగా టీచర్ల నియామకాలతో పాటు స్కూళ్లల్లో వసతుల ఏర్పాట్లపై న్యాయస్థానం ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మైనార్టీలకు ఇక పెద్ద దిక్కు బండి సంజయేనా.. ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్..?
తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణలో ఇదివరకే రెండు వేల టీచర్ల నియామకాలు పూర్తి చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇవే గాకుండా ఇంకా నాలుగు వేల పోస్టులకు పైగా టీచర్లను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని.. అయితే హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండటంతో ఆలస్యమవుతున్నట్లుగా సుప్రీంకోర్టుకు విన్నవించారు. అదలావుంటే తెలంగాణ అంశాన్ని వచ్చే వారం విచారిస్తామని తెలిపింది ధర్మాసనం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications