సుప్రీం జడ్జి చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు-ప్రభుత్వాల్ని జవాబుదారీగా మార్చాల్సింది మేథావులే
భారత్ లో ప్రభుత్వాల పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల తప్పులు బయటపెట్టాల్సింది, తప్పుడు వార్తలు, నకిలీ వార్తల్ని అడ్డుకోవాల్సింది మేథావులే అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో భారత దేశ ఆరో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగ్లా స్మారక ఉపన్యాసం చేసిన జస్టిస్ చంద్రచూడ్... దేశంలో తాజా పరిస్దితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేసేలా, తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు రాకుండా చూసేలా మేథావులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వాలపై అతిగా ఆధారపడకూడదని కూడా చంద్రచూడ్ తెలిపారు. ఇందుకు తాజాగా కోవిడ్ సందర్భంగా వచ్చిన పలు నకిలీ వార్తలు, విశ్లేషణలు, వివరాలను ఆయన గుర్తు చేశారు.

నిరంకుశ ప్రభుత్వాలు తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం అబద్ధాలపై నిరంతరం ఆధారపడతాయని, ఈ క్రమంలో చాా తప్పిదాలు చోటు చేసుకుంటాయని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. తాజాగా కోవిడ్ సందర్భంగా వివిధ ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును ఆయన ఓసారి గుర్తు చేసుకున్నారు. భారత్ లో కోవిడ్ ప్రభావం తక్కువ చేసి చూపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయంటూ మేథావులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్ధల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో చంద్రచూడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Recommended Video
సమాజంలో ఫేక్ న్యూస్ పెరుగుతోందని, అయితే జనం తమ స్వభావం రీత్యా సంచలనాలకు ప్రభావితం అవుతారని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఫేక్ న్యూస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇన్ఫోడెమిక్ గా పేరు పెట్టిన విషయాన్ని చంద్రచూడ్ గుర్తు చేశారు. మరోవైపు నకిలీ ప్రచారాలకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ వంటివి వేదికలుగా మారుతున్నాయని కూడా చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భిన్నాభిప్రాయాల్ని ఆమోదించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రజలు ఎక్కువగా న్యూస్ పేపర్లపై ఆధారపడుతున్నారని, కానీ మేథావులు రచించిన రచనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రచూడ్ తెలిపారు.
-
ఎస్సీ రిజర్వేషన్లు రద్దు!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications