కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు - Newsreel
కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ విషయంపై జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పరిహారం ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో ఆరు వారాల్లోగా తేల్చాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)కు సూచించింది.
https://twitter.com/ANI/status/1410105725670412292
''కోవిడ్తో మరణించిన కుటుంబాలకు చట్టబద్ధంగా ఎన్డీఎంఏ కనీస పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పరిహారం ఇవ్వని పక్షంలో, తన బాధ్యతలను నిర్వర్తించడంలో సంస్థ విఫలమైనట్టే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయవాదులు గౌరవ్ బన్సాల్, రీపక్ బన్సాల్లు దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సమయంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ గౌరవ్, రీపక్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు: ఒవైసీ పార్టీ ముస్లింల ఓట్లను చీలుస్తుందా? దీంతో బీజేపీకే లాభమా?
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- 'ఆ పెన్డ్రైవ్లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- 'రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- 'మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)