పెగాసస్ పై సోషల్ మీడియాలో చర్చ- పిటిషనర్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వివాదంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలతో పాటు ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు కూడా సోషల్ మీడియాలో దీనిపై చర్చలు సాగిస్తున్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నీ మీరే మాట్లాడేసుకుంటే ఇక మాతో పనేముందని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పిటిషనర్లపై సీరియస్ అయ్యారు.
ఓవైపు సుప్రీంకోర్టులో తమ పిటిషన్ పై విచారణ సాగుతుండగానే పిటిషనర్లు సోషల్ మీడియాలో చర్చలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్దానం.. వ్యవస్ధపై గౌరవం ఉంటే ఇలాంటి చర్చలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ పిటిషన్లను విచారిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషనర్లు సోషల్ మీడియాలో తమ పిటిషన్లలో ఉన్న అంశంపై చర్చ పెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎవరూ లక్ష్మణ రేఖ దాటవద్దని, ఈ కేసులో అందరికీ తమ వాదన వినిపించే అవకాశం కల్పిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చర్చకు తాము విరుద్ధం కాదని, ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని, ఎలాంటి వాదనలైనా తమ ముందే జరగాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కాబట్టి మీ వాదనేదైనా ఉంటే అది నేరుగా కోర్టులోనే వినిపించాలని ఆయన పిటిషనర్లకు సూచించారు.

Recommended Video
పెగాసస్ వివాదంపై దాఖలైన ఈ కేసులో తమ అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరడంతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటులో పెగాసస్ పై ప్రకటన చేసింది. కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పెగాసస్ తయారీదారులతో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని లోక్ సభలో తెలిపారు. అయినా విపక్షాలు మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం విచారణకు ఆదేశించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణలో వచ్చే తీర్పు కీలకంగా మారబోతోంది.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
మీ కళ్లు ఎంత షార్ప్.. ఈ సంఖ్యల్లో వేరుగా ఉన్న దాన్ని కనిపెట్టగలరా ?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications