జల్లికట్టు: తమిళనాడుకు నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జల్లికట్టు వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జల్లికట్టు నిర్వహించాలని జరిగిన ఆందోళనలో హింస చోటు చేసుకుందని, అయినా మీరు శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు విఫలం అయ్యారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
జల్లికట్టు ఆందోళన హింసాత్మకంగా మారిపోవడానికి అసలుకారణాలు ఏమిటి ? చెన్నై నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అల్లర్లు జరిగాయి ? అందుకు ఎవరు బాధ్యులు ? అని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జల్లికట్టు క్రీడను రద్దు చెయ్యాలని జంతు హక్కుల సంఘాలు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. మంగళవారం ఈ అర్జీ పరిశీలించిన సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అయ్యింది అని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదే విధంగా జల్లికట్టు నిర్వహించాలని తమిళనాడు అసెంబ్లీలో ఎలా తీర్మానం చేశారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications