Supreme Court: సూసైడ్ నోట్ మాత్రమే సరిపోదు, ఆధారాలు అవసరం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court: ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా తేలిన వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. నిందితుడు మృతురాలిని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని, తద్వారా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా బలవంతం చేశాడని ఆరోపించారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసును నిరూపించడానికి సూసైడ్ నోట్ మాత్రమే సరిపోదని, దానితో పాటు బలమైన ఆధారాలు అవసరమని కోర్టు పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరం అని నిరూపించాలంటే ఆత్మహత్యకు ప్రేరేపించాలనే స్పష్టమైన ఉద్దేశం ఉందని ప్రాసిక్యూషన్ నిరూపించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కేసును నిరూపించాలంటే స్పష్టమైన ఆధారం ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడికి ఆత్మహత్యను ప్రేరేపించాలని స్పష్టమైన మానసిక ఉద్దేశం ఉండాలని.. ఆత్మహత్యకు పాల్పడేలా బలవంతం చేసే ప్రత్యక్ష చర్య లేకపోతే కేవలం వేధింపులు లేదా విభేదాలు సరపోవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
స్పష్టమైన ఆధారాలు ఉంటేనే సూసైడ్ లెటర్ చెల్లుబాటు..
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సూసైడ్ నోట్ వదిలివేస్తే.. దానికి ఇతర స్పష్టమైన ఆధారాలు మద్దతు ఇవ్వకపోతే అది శిక్ష విధించడానికి సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. సూసైడ్ నోట్ ప్రామాణికతను నిరూపించాలని కోర్టు వెల్లడించింది. దీని కోసం చేతిరాత నిపుణుడి సాక్ష్యం కూడా అవసరమని తెలిపింది. ఓ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ప్రత్యక్ష ఆధారాలు లేవని.. ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ప్రాసిక్యూషన్ వద్ద కచ్చితమైన ఆధారాలు లేవని నిందితులు పేర్కొన్నారు.

నిర్ధోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు
ఓ కేసులో గుజరాత్ హైకోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. తాజాగా సుప్రీంకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు తీవ్రంగా రెచ్చగొట్టినప్పుడు, ప్రేరేపించినప్పుడు లేదా బలవంతం చేసినప్పుడు మాత్రమే సూసైడ్ కు ప్రేరేపించినట్లుగా నిరూపించబడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పటేల్ బాబూభాయ్ మనోహర్ దాస్, ఇతరులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
ఈ కేసు గుజరాత్ కు చెందినది. మే 14, 2009న గుజరాత్ లోని మెహ్సానాలో ఓ వ్యక్తి విషం తాగాడు. అనంతరం అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఒక మహిళతో ఉన్న అభ్యంతరకరమైన ఫొటోలు తీశారని.. దీని ఆధారంగా కొంతమంది అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మృతుడి కుటుంబం ఆరోపించింది. మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆ సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు మొత్తం నలుగురిని నిందితులుగా నిర్ధారించారు. కింది కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది. గుజరాత్ హైకోర్టు 2013 డిసెంబర్ 17న ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నిందితులను దోషులుగా నిర్ధారించింది. కానీ సుప్రీంకోర్టు వారిని నిర్ధోషులుగా విడుదల చేసింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications