పింఛన్ దరఖాస్తుదారుల్లో రైనా, మహ్మద్ కైఫ్!
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ కోసం దరఖాస్తు చేసినవారిలో క్రికెటర్లు సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్, రాజకీయ రంగంలో ఉన్న నటుడు రాజ్బబ్బర్ తదితరులు ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా పింఛన్లు కల్పించడం, వారు దరఖాస్తు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాధనాన్ని ఇలాంటివారిపై ఏకపక్షంగా ఖర్చు చేయడం తగదని ప్రతిపక్షాలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యశ్భారతి పురస్కారాన్ని దక్కించుకున్నవారికి నెలకు రూ.50,000 చొప్పున పింఛన్గా చెల్లిస్తామని గత అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పురస్కారాలు పొందిన 141 మందిలో 108 మంది నిర్ణీత గడువులోగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి.
సురేష్ రైనా, రాజ్బబ్బర్, కైఫ్, రాజ్ బబ్బర్, అతని భార్య నదిరా బబ్బర్, గాయకులు సుభా ముద్గల్, కైలాష్ ఖేర్ వంటివారూ దరఖాస్తు చేసుకోవడంపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అభ్యంతరం తెలిపాయి. పింఛన్ను తిరస్కరించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను ఇతరులూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించాయి.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications