దొంగల లిస్టులో మోడీ..! రాహుల్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా
పాట్నా : లోక్సభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడి వేసినా భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఇరు పార్టీల లీడర్లు నువ్వెంతంటే నువ్వెంత అంటున్నారు. ఆ క్రమంలో ఈ నెల 13వ తేదీన మహారాష్ట్రలో జరిగిన ర్యాలీ సందర్భంగా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దొంగల పేర్లున్న జాబితాలో మోడీ పేరు ఎందుకుందని రాహుల్ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఓ అడుగు ముందుకేసి పరువు నష్టం దావా వేశారు. మోడీ పేరున్నవారిని రాహుల్ కించపరిచారని ఆరోపిస్తూ.. పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట కేసు ఫైల్ చేశారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని సుశీల్ కుమార్ మోడీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీన ఈ పిటిషన్ విచారణకు రానుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications