Swamiji: మఠంలో ఆ 47 ఫోటోలు మాయం, చోరీ కేసులో మాజీ ఎమ్మెల్యే అందర్, భార్య కోసం ? !
బెంగళూరు/చిత్రదుర్గా: ప్రముఖ మఠంలోని స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద లైంగిక వేధిపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ స్వామీజీ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. జైల్లో నుంచి బయటకు రావాలని స్వామీజీ కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల స్వామీజీ ఆశ్రమంలో చాలా ముఖ్యమైన ఫోటోలు చోరీ అయ్మాయి. మఠం ఆవరణంలో ఫోటోలు మాయం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Lady techie: భార్యను స్పాట్ లో చంపేసిన బ్యాంక్ మేనేజర్, లవ్ మ్యారేజ్, మరో టెక్కీతో భార్యకు !
జైలుకు వెళ్లిన స్వామీజీ
కర్ణాటకలోని చిత్రదుర్గా సమీపంలోని మురుగా మఠం స్వామీజీ ఆమఠంలోని స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద లైంగిక వేధిపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు స్వామీజీ అరెస్టు అయ్యి జైలుకు పంపించారు. ఈ కేసులె ఇటీవల పోలీసులు కోర్టులో షార్జ్ షీటు దాఖలు చేశారు.
మఠంలో ఫోటోలు మాయం
జైల్లో నుంచి బయటకు రావాలని మురుగా మఠం స్వామీజీ కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మురుగా మఠం ఆవరణంలో చాలా ముఖ్యమైన ఫోటోలు చోరీ అయ్మాయి. ప్రముఖులు, రాజకీయ నాయకులు మఠానికి వెళ్లిన సమయంలో స్వామీజీ వారితో ఫోటోలు తీసుకున్నారు, ఆ ఫోటోలు ఆశ్రమం ఆవరణంలో హాట్ లోని గొడలకు పెట్టారు
మాజీ ఎమ్మెల్యే అరెస్టు
మఠం ఆవరణంలో ఏకంగా 47 ఫోటోలు మాయం కావడంతో రంగంలోకి దిగిన చిత్రదుర్గా గ్రామీణ పోలీసులు మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ భార్య సౌభాగ్యను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని చిత్రదుర్గా గ్రామీణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే కొందరు అరెస్టు
మురుగా మఠంలో 27 ఫోటోలు మాయం అయిన కేసులో ఇదే నెల 7వ తేదీన హోసహళ్లి గ్రామ పంచాయితీ సభ్యుడు మోహన్ మూర్తి అలియాస్ మోహన్ స్వామిని, ఎస్ జేఎం కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న శివానందస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు గురువారం మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ ఫోటోలు ఏం చేశారు ?
మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ప్రోద్బలంతోనే మఠంలో 47 ఫోటోలు మాయం చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ఇంటిలో, ఆయనకు సంబంధించిన వారి నివాసాలు, కార్యాలయాల్లో మఠంలో మాయం అయిన ఫోటోల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద మరోసారి మురుగా మఠం వార్తల్లోకి వచ్చింది.