మోదీకి నచ్చని మాట చెప్పేసిన స్వరూపానంద..! భవిశ్యత్ పరిణామాలపై బీజేపి దృష్టి..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం వంటి రాజకీయాలు ఆయన ప్రత్యేకతగా చెప్పొచ్చనే చర్చ జరుగుతోంది. తన ముందు ఇతర పార్టీ నేతలను పొగిడినా, తన పార్టీ కాకుండా ఇతర పార్టీల గురించి గొప్పగా ప్రస్థావన తెచ్చినా ఆయన అంతగా భరించలేరు. అందుకే తనకు మిత్రులు గాని, శత్రువులు గాని శాశ్వతంగా ఉండరు. ఏ రాష్ట్రంలో అయినా నరేంద్రమోడీ ఎవరితో అయినా స్నేహం చేస్తే అది ఇంకొకరిమీద పై చేయి సాధించడానికే గాని ఒకరిమీద ప్రేమతో కాదనే విషయం ఇప్పటికే స్పస్టమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు చంద్రశేఖర్ రావుతో మోడీ సఖ్యతగా ఉన్నారు. దీనికి కారణం చంద్రశేఖర్ రావు అంటే మోడీకి ఇష్టం అని కాదు, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి మోడీ వేసిన ప్లాన్లో చంద్రశేఖర్ రావు తో పాటు బీజేపి ఎంతో లబ్ధి పొందింది. అంతే. కాంగ్రెస్ ను తెలంగాణలో ఖతం చేయాలనే మోడీ లక్ష్యం నెరవేరింది. 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం దిశగా మోదీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆధ్యాత్మిక వేత్త స్వరూపానంద స్వామి మోదీ చెవులకు కర్ణకఠోరమైన మాటలు వినిపించారు.
Recommended Video


2024 తర్వాత ప్రభుత్వాన్ని దించేయడానికి సిద్ధమైపోయినట్టు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆద్యాత్మిక గురువులు రాజకీయ పార్టీల గురించి భిన్నంగా వ్యాఖ్యలు చేయడాన్ని మోదీకి అంతగా రుచించడంలేదనే అంశం స్పష్టమవుతోంది. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం బలహీనపడుతోందని గత లోక్ సభఎన్నికలు నిరూపించాయి. చంద్రశేఖర్ రావు ను దించడానికి ప్రజలు కూడా కాంగ్రెస్ స్థానంలో మోడీని వాడదామనుకోవడం బీజేపీకి కలిసొస్తోంది. అంటే బీజేపీకి పడే ప్రతి ఓటు చంద్ర శేఖర్ రావుపై కోపంతోనే అని చెప్పొచ్చు. అయితే మోడీ వ్యూహానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక వేత్త స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీకి చెవులకు నచ్చని మాట చెప్పారు. 15 ఏళ్లు చంద్ర శేఖర్ రావు సీఎంగా ఉండాలని దీవించారు. ఈ మాటతో స్వరూపానంద మోడీ కంట్లో పడ్డారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ వేడి ఏంటో స్వరూపానందకు తగలకతప్పదనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఏపీలో సీఎం జగన్ ని కూడా దీవించారు స్వరూపానంద. అక్కడ బీజేపీ టార్గెట్ 2029. కానీ 2039 వరకు జగనే సీఎంగా ఉండాలని స్వరూపానంద ఆకాంక్షిస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో మోడీ ఎంట్రీని స్వరూపానంద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విశాఖ స్వాములు. స్వాముల వ్యాఖ్యలను మోదీ-షా ద్వయం అంత తేలిగ్గా తీసుకోదనే చర్చ జరుగుతోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications