బడ్జెట్ 2018: తమిళనాడు సీఎం ఏమన్నారంటే: తమిళసై, ఊహించలేదన్న: వీసీకే!
చెన్నై: కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో సమర్పించిన బడ్జెట్ 2018-19పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ చాల బాగుందని ఎడప్పాడి పళనిస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ తో దేశం అభివృద్ది చెందుతుందని, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని, ముఖ్యంగా మహిళలు, రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్బుతంగా ఉందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ అభివృద్ది విషయంలో భారతదేశం ముందుకు దూసుకుపోతుందని తమిళసై సౌందరరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాల నిరాశ పరిచిందని, ఇలాంటి బడ్జెట్ వస్తుందని తాను ఊహించలేదని వీసీకే నేత తిరుమావళన్ అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications