Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడు సీఎం, స్పీకర్ భేటీ: రెబల్ ఎమ్మెల్యేలపై వేటు ? అసెంబ్లీలో అడుగుపెట్టకుండా !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు దారిలోకి రాకుంటే వారి మీద అనర్హత వేటు వెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

సోమవారం మద్యాహ్నం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ను సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి కలుసుకుని చర్చించారు. రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ మూడు సార్లు నోటీసులు ఇచ్చినా వారి నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.

Tamil Nadu CM Palanisamy met Speaker Dhanapal at secretariat

అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు అందరిమీద పార్టీ నియమాలు ఉల్లంఘించారని, అధికారంలో ఉన్న సొంత పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటు చేశారని వారి మీద వేటు వెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అనర్హత వేటు వేస్తే రెబల్ ఎమ్మెల్యేలు దారిలోకి వచ్చే అవకాశం ఉందని పళనిసామి, పన్నీర్ సెల్వం భావించారు. మంగళవారం చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకాకుంటే కచ్చితంగా వారి మీద స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉందని, ఇదే విషయంపై సోమవారం ధనపాల్, పళనిసామి చర్చించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+