ప్రధాని పేరు తెలియని మంత్రి ఉండటం సిగ్గుచేటు: ఆమె మహారాణిలా ఫీలైపోతున్నారు !
ప్రధాని పేరు తెలీయని వ్యక్తి ఒక రాష్టానికి మంత్రితమిళనాడు ప్రజలకు ఏం సేవ చేస్తారు, సిగ్గుచేటుఆమె ఒక మహారాణిలా ఫీలైపోతున్నారు, కేంద్ర మాజీ మంత్రి ఇళంగోవన్
చెన్నై: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు గుర్తు లేని వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి మంత్రిగా ఉండటం సిగ్గుచేటు అని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈవీకేఎస్, ఇళంగోవన్ మండిపడ్డారు. తమిళనాడు అటవి శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పిన విషయం తెలిసిందే.
తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ బహిరంగ సభలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అని చెప్పి నవ్వులపాలైనారు. ఈ విషయంపై సోమవారం కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్. ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి పేరు బహిరంగ సభలో తప్పు చెప్పిన మంత్రిగా ఉండటం మన కర్మ అన్నారు.
ఆయన రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విషయం ఎలా గుర్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. బీజేపీ తమిళనాడు శాఖ బీజేపీ అధ్యక్షురాలు తిమిళిసై సౌందరరాజన్ మీద ఇదే సమయంలో ఈవీకేఎస్. ఇళంగోవన్ విమర్శలు చేశారు. తమిళిసై సౌందరాజన్ ఆమెకు ఆమె ఒక మహారాణిలాగా ఫీలైపోతున్నారని ఆరోపించారు.
తమిళనాడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి తరువాత కాంగ్రెస్ పార్టీని విమర్శించాలని కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇంళగోవన్ సూచించారు. తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ మీద తమిళనాడులోని ప్రతిపక్ష నాయకులు వ్యంగంగా విమర్శిస్తున్నారు.