వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతుల ధర్నా, మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపు
తమిళనాట రుణమాఫీ కోసం రోజుకో రకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సమస్యలు పట్టించుకునే వారు లేరు. కానీ, ఓ వైపు రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు అయ్యాయి.
చెన్నై: తమిళనాట రుణమాఫీ కోసం రోజుకో రకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సమస్యలు పట్టించుకునే వారు లేరు. కానీ, ఓ వైపు రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు అయ్యాయి.
ప్రస్తుతం వారికి ఇస్తున్న వేతనంలో పెంపు కావాలని ఏకంగా 100 శాతం పెంపును ప్రతిపాదిస్తూ తమిళనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని ఎమ్మెల్యేలు ఆమోదించారు.
ఈ మేరకు బిల్లు ఆమోదం పొందినట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.55000 చొప్పున జీతం వచ్చేది.
ఈ బిల్లు ఆమోదం వల్ల నెలకు రూ. 1.05 లక్షల వేతనం రానుంది. రుణమాఫీ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళ రైతులు రోజుకో రకంగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
English summary
The salaries of Tamil Nadu MLAs has been increased from Rs 55,000 to Rs 1.05 lakh per month, chief minister Edappadi K Palaniswami announced in the assembly on Wednesday. The chief minister also announced that MLA Local Area Development Fund would be increased from Rs 2 crore to 2.5 crore.
Story first published: Wednesday, July 19, 2017, 16:22 [IST]