సంచలనం: రజనీకాంత్ పార్టీ పెడతారు, ఎన్ డి ఏ కు మద్దతిస్తారు
రజనీకాంత్ త్వరలోనే కొత్త పార్టీ పెడతారని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి శుక్రవారం నాడు ప్రకటించారు. రజనీ రాజకీయరంగ ప్రవేశంతో తమిళనాడులోని చిన్న పార్టీలన్నీ కనుమరుగు కాకతప్పదన్నారు గురుమూర్తి.
చెన్నై: రజనీకాంత్ త్వరలోనే కొత్త పార్టీ పెడతారని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి శుక్రవారం నాడు ప్రకటించారు. రజనీ రాజకీయరంగ ప్రవేశంతో తమిళనాడులోని చిన్న పార్టీలన్నీ కనుమరుగు కాకతప్పదన్నారు గురుమూర్తి.
శుక్రవారంనాడు గురుమూర్తి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. రజనీకాంత్ పార్టీ పెట్టడం ఖాయమని ఆయన తేల్చేశారు. అంతేకాదు ఎన్ డీ ఏ కూటమికే రజనీకాంత్ మద్దతిస్తారని ఆయన ప్రకటించారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని రాజకీయాలకు అతీతంగా అభిమానులు కోరుతున్నారు. ప్రధానమంత్రి మోడీ సైతం గత లోక్ సభ ఎన్నికల సమయంలో రజనీకాంత్ ఇంటికి వెళ్ళి రజనీ మద్దతును కోరారు.
తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న, రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితుడొకరు ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని రజనీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొన్నారని ఆయన సన్నిహితుడొకరు ప్రకటించారు. అభిమానులతో సమావేశమైన తర్వాత భారీ బహిరంగసభను ఏర్పాటుచేసి ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు ఆయన చెప్పారు.