టాటాల చేతికి ఎయిర్ ఇండియా- 69 ఏళ్ల తర్వాత-వరల్డ్ క్లాస్ గా మారుస్తామన్న ఛైర్మన్ చంద్రశేఖరన్
నష్టాల ఊబిలో చిక్కుకుని సతమతం అవుతూ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణకు దారితీసిన ఎయిర్ ఇండియా విజయవంతంగా తిరిగి టాటాల చేతుల్లోకి వెళ్లింది. ఇవాళ అధికారికంగా ఈ ప్రక్రియకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీంతో 69 ఏళ్ల క్రితం మహారాజా ఎయిర్ లైన్స్ గా టాటాల చేతుల్లో నుంచి ప్రభుత్వానికి వెళ్లిన విమానయాన సంస్ధ కాస్తా తిరిగి ఎయిర్ ఇండియాగా సొంతగూటికి చేరింది. దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ లైన్స్ గా తీర్చిదిద్దుతామని టాటా సంస్ధ ప్రకటించింది.

టాటాలకు ఎయిర్ ఇండియా అప్పగింత
ఒకప్పుడు దేశంలోనే తొలి విమానయాన సంస్ధగా పేరుగాంచిన టాటాలకు చెందిన మహారాజా ఎయిర్ లైన్స్ కాలక్రమంలో ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. తిరిగి 69 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం దీన్ని నిర్వహించలేమని చేతులెత్తేయడంతో తిరిగి సొంత గూటికి చేరిపోయింది. నష్టాల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను నడిపించే పరిస్ధితి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో భాగంగా దీన్ని తిరిగి దాని మాజీ యజమాని టాటాలకు ఇవాళ అదికారంగా అప్పగించేసింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి టాటా నిర్వాహకులు దీన్ని చేతుల్లోకి తీసుకున్నారు.

బదిలీ ప్రక్రియ ఇలా
కేంద్రం చేతుల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇప్పుడు తాజా నిర్ణయంతో టాటాల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో దీని నిర్వహణ నియంత్రణతో పాటు ఎయిర్ ఇండియాకు ఉన్న 100 శాతం షేర్లను తలాస్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేయడంతో ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ విజయవంతంగా ముగిసిటన్లయింది. వ్యూహాత్మక భాగస్వామి నేతృత్వంలోని కొత్త బోర్డు ఎయిర్ ఇండియా బాధ్యతలు తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు.
ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సకాలంలో విజయవంతంగా ముగించడం నిజంగా విశేషమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
Recommended Video

వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దుతామన్న టాటా ఛైర్మన్
ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్ చేతుల్లోకి రావడంపై ఛైర్మన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. "ఎయిరిండియాను తిరిగి టాటా గ్రూప్లో చేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ శ్రేణి విమానయాన సంస్థను రూపొందించడంలో అందరితో కలిసి పనిచేయాలని మేము ఎదురుచూస్తున్నాము'' అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. యాజమాన్య బదలాయింపు ప్రక్రియకు ముందు ప్రధాని మోడీతో సమావేశమైన ఆయన.. దీన్ని ప్రపంచ శ్రేణి సంస్ధగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications