Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్యాష్‌లెస్ కోసం వ్యూహం: రూ.2వేల లోపు సర్వీస్ ట్యాక్స్ ఉండదు!

రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత దేశంలో క్యాష్ లెస్ లావాదేవీల వైపు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ప్రజలను దాదాపుగా క్యాష్ లెస్ లావాదేవీల వైపు మళ్లించేందుకు కేంద్రం యోచిస్తోంది.

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత దేశంలో క్యాష్ లెస్ లావాదేవీల వైపు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ప్రజలను దాదాపుగా క్యాష్ లెస్ లావాదేవీల వైపు మళ్లించేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది.

డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2వేల లోపు జరిపే లావాదేవీలకు సర్వీస్ ట్యాక్స్ ఎత్తివేయాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు మరింత సులువు అవుతోందని భావిస్తోంది.

మరోవైపు, నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్యులు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల ఇబ్బంది దృష్ట్యా ఆర్బీఐ చేసిన ప్రకటన కొంత ఊరట కలిగించే విధంగా ఉంది.

Tax Break On Payments Upto Rs 2000 If You Use Card, Not Cash

త్వరలో విత్ డ్రా పరిమితి పెంచుతామని ఆర్బీఐ ప్రకటించింది. డిమాండుకు తగిన విధంగా నోట్లు ఉన్నాయని తెలిపింది. సాధారణ పరిస్థితికి రాగానే విత్ డ్రా పైన పెట్టిన ఆంక్షలు, పరిమితులు ఎత్తివేస్తామని ప్రకటించింది.

మరో రెండు వారాల్లో కొత్త రూ.1వేలు, రూ.5వందల నోట్లు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కొత్త వెయ్యి నోట్లను రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+