ఎటిఎం డబ్బులతో వ్యాన్ డ్రైవర్ పరారీ: యువతిపై రేప్
కోల్కతా/ న్యూడిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా నగరంలో మంగళవారం రాత్రి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి - టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న మహ్మద్ సజిర్ ఆలం తొప్సియాలో నివాసం ఉంటున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన యువతిని మంగళవారం రాత్రి మైదాన ప్రాంతంలోకి తీసుకువెళ్లిన మహ్మద్ సజిర్ ఆలం ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు మహ్మద్ సజిర్ ఆలంను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రూ. 54లక్షలతో వ్యాన్ డ్రైవర్ పరారీ
ఏటీఎంలకు నగదును చేర్చే వ్యాన్ డ్రైవర్ 54 లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన బుధవారం ఉదయం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగదు నిర్వహణ సేవల(సిఎంఎస్)ను అందించే సంస్థలో సంజయ్ వ్యాన్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
విధి నిర్వహణలో భాగంగా సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ భాగ్లోని ఓ ఏటీఎం వద్దకు వ్యాన్తోపాటు చేరుకున్నారు. ఇతర సిబ్బంది డబ్బులు ఏటీఎంలో లోడ్ చేస్తున్న సందర్భంలో సంజయ్ వ్యాన్తో సహా పరారైయ్యాడు. వ్యాన్లో కోటి రూపాయలుండగా ఓ ఏటీఎంలో 46లక్షల రూపాయలు లోడ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. కాగా వ్యాన్లో 54లక్షల రూపాయాలున్నట్లు అధికారులు తెలిపారు. సంస్థ సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.