Teacher: లేడీ టీచర్ కాళ్లు, చేతులు కట్టేసి ?, శరీరం మీద, బీరువాలో ?, ఏం జరిగింది ?!
బెంగళూరు/విజయవాడ: ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేసి ఇటీవల రిటైడ్ అయిన మహిళ సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. మహిళకు ఆస్తులు చాలా ఉన్నాయని అంటున్నారు. సాయంత్రం మహిళ ఇంట్లో ఉన్నారు. ఆ సందర్బంలో రిటైడ్ లేడీ టీచర్ ఇంటికి వెళ్లిన వాళ్లు ఆమెతో కొంతసేపు మాట్లాడారని సమాచారం. తరువాత మహిళ కాళ్లు, చేతులు కట్టేసిన నిందితులు ఆమెను హత్య చేసి ఆమె శరీరం మీద ఉన్న, ఇంట్లో బీరువాలోని లక్షల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేసి పరారైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది. విజయవాడకు చెందిన లేడీ టీచర్ కుటుంబ సభ్యులు ఐటీ హబ్ లో సెటిల్ అయ్యారు.
విజయవాడ టూ బెంగళూరు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ప్రసన్న కుమారి అనే మహిళ కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని సెటిల్ అయిపోయారు. ప్రసన్న కుమారి విద్యాభ్యాసం బెంగళూరులో జరిగింది. ప్రసన్న కుమారి బెంగళూరుని విద్యారణ్యపురలోని అంబా భవాని దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు.
చింతామణిలో టీచర్
ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని చింతామణి ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేసిన ప్రసన్న కుమారి ఇటీవల రిటైడ్ అయ్యారు. రిటైడ్ అయిన తరువాత ప్రసన్న కుమారి బెంగళూరులోని విద్యారణ్యపురలోని అంబా భవాని దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. సొంత ఇంటిలో నివాసం ఉంటున్న ప్రసన్న కుమారి ఇంటికి ఆమె బందువులు వచ్చి వెలుతున్నారు.
రిటైడ్ టీచర్ కాళ్లు, చేతులు కట్టేసి ?
రిటైడ్ టీచర్ ప్రసన్న కుమారికి ఆస్తులు చాలా ఉన్నాయని అంటున్నారు. సాయంత్రం ప్రసన్న కుమారి బెంగళూరులోని విద్యారణ్యపురలోని ఆమె ఇంట్లో ఉన్నారు. ఆ సందర్బంలో రిటైడ్ లేడీ టీచర్ ప్రసన్న కుమారి ఇంటికి వెళ్లిన వాళ్లు ఆమెతో కొంతసేపు మాట్లాడారని సమాచారం. తరువాత ప్రసన్న కుమారి కాళ్లు, చేతులు కట్టేసిన నిందితులు ఆమెను హత్య చేశారు.
ఇంట్లో ఏం జరిగింది ?
రిటైడ్ టీచర్ ప్రసన్న కుమారి శరీరం మీద ఉన్న, ఇంట్లో బీరువాలోని లక్షల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేసి పరారైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది. విజయవాడకు చెందిన లేడీ టీచర్ ప్రసన్న కుమారి కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల క్రితమే బెంగళూరు చేరుకుని సెటిల్ అయ్యారు. ప్రసన్న కుమారిని ఆస్తి, నగల కోసం హత్య చేశారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు అంటున్నారు.