వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రియుడి ప్రేయసిని చంపేసిన మహిళా టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

kill
ముంబై: ఓ ముక్కోణపు ప్రేమ కథ విషాదానికి దారి తీసింది. ఈ వ్యవహారం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకోగా, మరో ఇద్దరిని న్యాయస్థానాల చుట్టూ చక్కర్లు కొట్టేలా చేసింది. మాజీ ప్రియుడిని సొంతం చేసుకోవడానికి ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనరీర్ అతడి ప్రియురాలిని చంపేసింది. ముగ్గురు కూడా బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నవారే కావడం విశేషం.

డిల్లీకి చెందిన జుహీ ప్రసాద్ న్యాయవాది. ఆమె పూణేకు చెందిన నీమేష్ సిన్హాను ప్రేమించింది. ఆమె కన్నా ముందు నీమేష్ అనుశ్రీ కుంద్రా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమించాడు. 2011 నవంబర్‌లో నీమేష్ ఫోన్ చేసి జూహీని ఫూణేకు ఆహ్వానించాడు. ఆమె పూణేకు వెళ్లింది.

అతని ఫ్లాట్‌లో వారిద్దరు ఓ రోజు గడిపారు. మర్నాడు ఉదయం అనుశ్రీ నీమేష్ ఫ్లాట్‌కు వచ్చింది. ఆ సమయంలో పడకగదిలో జుహీ నిద్రిస్తోంది. ఆమెపై అనుశ్రీ పెట్రోల్ పోసి నిప్పంచింది. ఈ సంఘటనలో జుహీ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనలో నీమేష్ ప్రమేయం కూడా ఉందని, పథకం ప్రకారమే తన కూతురిని హత్య చేశారని జుహీ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. జుహీని నీమేష్ రక్షించడానికి ప్రయత్నించలేదని, అలా చేసి ఉంటే కాలిన గాయాలతోనైనా తన కూతురు బయటపడి ఉండేదని ఆయన అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది.

English summary
A lady software engineer has killed her ex lovers fiancee at Pune in Maharastra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X