ఆగష్టు 15 వేడుకల నుండి వస్తోన్న విద్యార్థినిపై గ్యాంగ్రేప్
ఇంటర విద్యార్థినిపై గ్యాంగ్రేప్ చోటుచేసుకొంది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.ఆగష్టు 15 వేడుకలకు కాలేజీకి వెళ్ళి వస్తున్న విద్యార్థినిపై అత్యాచారం చేశారు నిందితులు
ఒడిశా: స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఒడిశా రాష్ట్రంలోని బంజనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బెల్లుగుంటా ఔట్ పోస్ట్ పరిధిలో మందరా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని బల్లిగుంఠా కాలేజీలో ఇంటర్ చదువుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు కాలేజీకి వెళ్ళి సైకిల్పై ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు యువకులు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ధనుంజయపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు విద్యార్థిని బొడో నదికి సమీపంలోని చెట్లపొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహతప్పి పడిపోయిన విద్యార్థినిని రొడ్డుపక్కన వదిలేసి వెళ్ళారు.
సాయంత్రం వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. నది ఒడ్డున కూతురు పడి ఉన్న విషయాన్ని గ్రామస్థుల ద్వారా తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్ళారు.
బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. కుటుంబసభ్యులు బెల్లిగుంఠా ఔట్పోస్ట్ అధికారికి ఫిర్యాదుచేశారు. ధనుంజయ్పల్లికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications