విద్యార్థినిని కిడ్నాప్ చేసిన టీచర్, నేపాల్ దేశస్థుడు అమ్మిన మహిళపై రేప్
బుండీ: రాజస్థాన్ రాష్ట్రంలోని నైనిటాల్ పట్టణంలో ఓ ప్రయివేటు పాఠశాల టీచర్ బాదల్ మహావార్ (28) తన దగ్గర చదువుకునే పద్నాలుగేళ్ల విద్యార్థిని అపహరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
గత మార్చి 10న ఉపాధ్యాయుడు విద్యార్థిని అపహరించాడు. అప్పడ్నుంచి టీచర్ పరారీలో ఉన్నాడు. ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
వాట్సప్లో అభ్యంతరక సందేశం, అరెస్ట్
వాట్సప్ ద్వారా ఒక మతానికి సంబంధించి అభ్యంతరకర సందేశం పంపించినందుకు పాఠశాల వైస్ ప్రిన్సిపల్ను అరెస్టు చేసిన సంఘటన యూపీలో జరిగింది. నవాబ్ గంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక ప్రయివేటు పాఠశాలలో వైస్ ప్రిన్సిపల్గా పని చేస్తున్నాడు.
ఒక మతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని ఆయన మే 11న వాట్సప్ ద్వారా పలువురికి పంపించాడు. దీంతో శాంతికి భంగం కలిగిస్తున్నారని అతని పైన స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ యాజమాన్యం కూడా అతడిని విధుల నుండి తొలగించింది.
సామూహిక అత్యాచారానికి గురై రైల్లో, అపస్మారక స్థితిలో..
ఓ మహిళను నేపాల్ దేశస్తుడు ముంబైలోని ఓ ముఠాకు అమ్మేశాడు. వారు ఆమె పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భోపాల్లో పాతన్ కోట్ ఎక్సుప్రెస్లో వదిలి వెళ్లారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఆమెను టిక్కెట్ కలెక్టర్ గుర్తించాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. కాగా, ఆ మహిళ బంగ్లాదేశ్కు చెందిన మహిళగా తెలుస్తోంది. ఆమె మహిళలను అమ్మే వారి చేతిలో పడింది. దాదాపు ఐదేళ్ల క్రితం ఆమెను భారత్ తీసుకు వచ్చారు. అప్పుడే ముంబైలో అమ్మేశారు.