యువతిని గదిలో బంధించి మూడ్రోజులపాటు రేప్ చేశాడు
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో 15ఏళ్ల యువతిని ఓ గదిలో బంధించిన యువకుడు(21) మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలి ఇంటికి సమీపంలోని వ్యక్తి కావడం గమనార్హం.
ఆదివారం సాయంత్రం ఆ యువతి నిందితుడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. విజయ్ చౌదరి అనే యువకుడు తనపై అత్యాచారం పాల్పడ్డాడని బాధితురాలు తన కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో బాధితురాలితోపాటు ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సోమవారం నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 5న విజయ్ చౌదరి బాధిత యువతిని కిడ్నాప్ చేశాడు. అతడు నివాసం ఉండే ఓ గుడిసెలో యువతిని బంధించాడు. ఆ తర్వాత మూడు రోజులపాటు ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుడు లేని సమయంలో బాధిత యువతి తప్పించుకుంది. కాగా, బాధిత యువతికి నిందితుడు పరిచయస్తుడేనని, సెల్ఫోన్ల వారిద్దరూ మాట్లాడుకునేవారని పోలీసులు చెప్పారు.