‘ఐ మిస్ యూ పాపా’: నిశ్చితార్థం రోజున లాలూ కోసం తేజ్ ప్రతాప్ భావోద్వేగ ట్వీట్
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. బీహార్ మాజీ మంత్రి చంద్రిక రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్య రాయ్ను తేజ్ ప్రతాప్ పెళ్లాడబోతున్నారు.
పాట్నాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బుధవారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దాదాపు 200 మంది దగ్గరి బంధువులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం సందర్భంగా ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, పుణె నుంచి పూలు తెప్పించి ప్రత్యేకంగా అలంకరించారు.

కాగా, దాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. దీంతో తేజ్ ప్రతాప్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 'మిస్ యూ పాపా' అని తన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Miss you PAPA 😔
— Tej Pratap Yadav (@TejYadav14) April 18, 2018
నిశ్చితార్థానికి రాలేకపోయినా.. తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి వేడుకకు మాత్రం లాలూ పెరోల్పై వచ్చే అవకాశం ఉంది. మే 12న పాట్నాలోని ఓ కళాశాల మైదానంలో తేజ్ప్రతాప్- ఐశ్వర్యల వివాహం జరగబోతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications