తేజస్వి యాదవ్ ప్రాణాలకు ప్రమాదం: రబ్రీ దేవి
Bihar: బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు, ప్రస్తుత ప్రతిపక్ష ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రాణాలకు ప్రమాదం ఉందని, గతంలో నాలుగు సార్లు యత్యాయత్నాలు జరిగాయని ఆమె వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. తేజస్విని చంపడానికి బీజేపీ-జేడీ(యూ) సభ్యులు కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.
శుక్రవారం రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు తేజస్వి యాదవ్ ప్రాణాలకు ప్రమాదం ఉందని, గతంలో 4 సార్లు హత్యాయత్నాలు జరిగాయని తెలిపారు. తేజస్విని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ బీహార్లో ప్రతిపక్ష ఇండియా కూటమికి సీఎం అభ్యర్థిగా పరిగణిస్తున్నారు. "తేజస్వి యాదవ్ను నాలుగు సార్లు దారిలో చంపడానికి ప్రయత్నించారు... ఇప్పుడు కూడా అతన్ని చంపడానికి కుట్రలు జరుగుతున్నాయి" అని రబ్రీ శుక్రవారం బీహార్ శాసన మండలి వరాండాలో మీడియాతో చెప్పారు. ఆమె 5 రోజుల సమావేశం చివరి రోజు అయిన వర్షాకాల సమావేశానికి హాజరు కావడానికి సభకు చేరుకున్నారు.

బీజేపీ-జేడీయూపై ఆరోపణలు
రబ్రీ దేవి నేరుగా బీజేపీ-జేడీయూ ఈ కుట్రల వెనుక ఉన్నారని ఆరోపించారు. బీహార్ శాసనసభలో ఒక రోజు ముందు అవాంఛనీయ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యులు ఒకరిపై ఒకరు దాదాపుగా ఘర్షణకు దిగారు. అయితే అదృష్టవశాత్తు భద్రతా దళాల సకాలంలో జోక్యం వల్ల ఇది నివారించబడింది. ఈ పరిస్థితిలో ఒక బీజేపీ సభ్యుడు టేబుల్ నుంచి మైక్ను పెకిలించి, తేజస్విపై దాడి చేయాలనే ఉద్దేశంతో అతని వైపు భయంకరంగా పరుగెత్తాడని కొందరు ఆర్జేడీ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణను ఎన్డీఏ నాయకులు ఖండించారు.












Click it and Unblock the Notifications