బురారీ సూసైడ్ కేసు: ఆ ఇంటిని దేవాలయంగా మార్చాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ బురారీ కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసులో దర్యాప్తు చేసే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారు చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూల్, వైర్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఓ వీడియో వెలుగు చూసింది. ఆ తర్వాత, తాజాగా ఆత్మహత్యకు తానే ప్రేరేపించినట్లు గీతామా అనే మహిళ ముందుకు వచ్చింది.
ఇదిలా ఉండగా, 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు భయానికి లోనవుతున్నారు.

దీనికి తోడు ఆత్మహత్య వెనుక కారణాలు మీడియాలో ప్రసారమవడం, పోలీసులు రోజూ ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారంతా ఆందోళనకు చెందుతున్నారు. ఇప్పటికే ఆ ఇంటి చుట్టుపక్కల నివసించే చాలామంది భయంతో తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారట.
ప్రస్తుతం నారాయణ్ దేవి ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చితేనే మంచిదని కొందరు స్థానికులు భావిస్తున్నారు. ఆ ఇంటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
మరోవైపు, మహిళా మంత్రసాని గీతామాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications