అద్దె అడిగిన ఇంటి యజమానిని చంపిన వైనం ..కరోనాతో ఆర్ధిక కష్టాలే కారణం
కరోనా కష్టకాలంలో ఊహించని దారుణాలు జరుగుతున్నాయి. ఇంటి అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని అత్యంత దారుణంగా చంపిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
చెన్నైలోని కుండ్రటూరులో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళితే
ఇంటి అద్దె ఖచ్చితంగా ఇవ్వాలని గట్టిగా అడిగినందుకు అద్దెదారు కుమారుడు ఇంటి ఓనర్ ని హతమార్చాడు. ధనరాజ్ అనే వ్యక్తి గుణశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా పనులు లేకపోవడంతో ధనరాజ్ అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. నాలుగు నెలల అద్దె ఇవ్వకపోవటంతో అద్దె కోసం గుణశేఖర్ ధనరాజ్ మీద పదేపదే ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ధనరాజ్ తో ఘర్షణకు దిగాడు. అద్దె చెల్లించాల్సిందే నంటూ భీష్మించుకు కూర్చున్నాడు.

అద్దె కోసం తన తండ్రిని నానా మాటలు అంటున్న ఇంటి ఓనర్ తీరును భరించలేకపోయాడు ధనరాజ్ కుమారుడు అజిత్. పట్టలేని కోపంతో ఇంటి యజమానిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు . విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో చెన్నైలో ఇంటి యజమానులు అద్దెకు ఉంటున్న వారిని అద్దె అడగాలంటేనే భయపడుతున్నారు .
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications