10th క్లాస్ విద్యార్థుల మధ్య ఘర్షణ...! తోటి విద్యార్థిని కత్తెరతో పోడిచి చంపిన మరో విద్యార్ధి
స్కూళ్లు,కాలేజీలకు వెళ్లి ప్రయోజకులు కావాల్సిన విద్యార్థులు సామాజీక మాధ్యమాలు,పోకడలను ప్రభావంతో హంతకులుగా మారుతున్నారు. తోటి విద్యార్థులనే కనీస ఆలోచన లేకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని హత్యలు చేస్తున్న సంఘటనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఈనేపథ్యంలో హస్టల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్ధిపై దాడి చేసి చంపివేశాడు.
తమిళనాడులోని కొడైకెనాల్ బోర్డింగ్ స్కూల్లో పదవతరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఓ విద్యార్ధి మరో విద్యార్థిపై అనూహ్యంగా దాడి చేశాడు. దాడి నేపథ్యంలోనే కత్తరతోపాటు,క్రికెట్ స్టంప్స్తో దాడి చేశాడు, కత్తరేతో పోడవడంతో రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన తోటి విద్యార్థి హస్టల్ అవరణలోనే మృత్యువాత పడ్డాడు.
అయితే ఇద్దరు విద్యార్థుల మధ్య ఇంత పెద్ద ఎత్తున కక్ష్యలు పెంచుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు, మరోవైపు హస్టల్లో సంఘటన జరిగినా సంబంధిత స్కూల్ యాజమాన్యం కూడ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.మరోవైపు దాడి చేసిన విద్యార్ధి మైనర్ కావడంతో వివరాలు గోప్యంగా ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.