Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం ఉచిత పథకాలు, ఈ ప్రభుత్వం ప్రజలకు శాపం, ఇలా చేస్తే చిప్పకూడు గ్యారెంటీ !

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 5 ఉచిత హామీ పథకాలను హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన 4 ఉచిత హామీ పథకాల గురించి గొప్పగా చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలను ఎండగట్టడానికి బీజేపీ సిద్దం అయ్యింది.

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం చెప్పుకుంటున్న ఉచిత హామీల పథకాలకు బీజేపీ కౌంటర్ వేస్తోంది. కర్ణాటకలోని ప్రతిపక్ష బీజేపీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను జాబితా తయారు చేసి విడుదల చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన శాపాలు ఇవే అంటూ అనేక పాయింట్ల జాబితాను విడుదల చేసింది.

The BJP is accusing the Siddaramaiah government of becoming a curse for the people of Karnataka
* కరెంటు ధరల రెట్టింపు, లోడ్ షెడ్డింగ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని వీధులను చీకటిలో నింపేసింది.

* రైతులు పంట వేయొద్దని స్వయంగా కర్ణాటక వ్యవసాయ మంత్రి రైతులను హెచ్చరించారు, బియ్యం ధరలు కూడా విపరీతంగా పెరిగింది,

* కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యం మాత్రమే సిద్దరామయ్య ప్రభుత్వం ఇస్తోంది.

* సిద్దరామయ్య ప్రభుత్వం చెప్పిన 5 కేజీల బియ్యం ఇవ్వడం లేదని, డబ్బు ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపించింది.

* శక్తి పథకం ద్వారా కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్లు బరితెగించిందని, ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సుల టికెట్‌ ధరలు పెరిగిపోయాయని బీజేపీ ఆరోపించింది.

*ప్రైవేట్‌ బస్సులు, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయి.

The BJP is accusing the Siddaramaiah government of becoming a curse for the people of Karnataka

* రాష్ట్రంలో కరువు తాండవం చేస్తోంది, జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. సిద్దరామయ్య ప్రభుత్వం పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదని బీజేపీ ఆరోపించింది.

* రాష్ట్ర ప్రజలకు కలుషిత తాగునీరు మాత్రమే సరఫరా అవుతోందని, తమిళనాడుకు మాత్రం ఈ సిద్దరామయ్య ప్రభుత్వం స్వచ్ఛమైన కావేరి నీరు విడుదల చేస్తున్నదని బీజేపీ ఆరోపించింది.

* పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి శివానంద పాటిల్ అంటున్నారని బీజేపీ మండిపడింది.

* కర్ణాటక వ్యవసాయ శాఖను రికవరీ సెంటర్‌గా, లంచాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చిన మంత్రి చెలువరాయస్వామి అని బీజేపీ ఆరోపించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం దుష్టపాలన కర్ణాటకకు ప్రమాదకరం అని, కాంగ్రెస్ డీఎన్ఏలో ప్రజావ్యతిరేక, ప్రజా వ్యతిరేకత ఉందని బీజేపీ ట్వీట్‌లో ఆరోపించింది.

The BJP is accusing the Siddaramaiah government of becoming a curse for the people of Karnataka
కర్ణాటక బీజేపీ సోమవారం నుంచి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేస్తోంది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేస్తున్న సిద్దరామయ్య ప్రభుత్వం రాష్ట్రంలో కరువు గురించి, రైతులు గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ ఆరోపించింది. ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు గండికొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కరువు ప్రకటనపై లెక్కలు వేస్తోంది బీజేపీ ట్వీట్ చేసింది.

కాంగ్రెస్‌కు ముందుచూపు లేకపోవడంతో కర్ణాటకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినంత వరకు ఎటువంటి సహాయ ప్యాకేజీని ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ఇప్పటికే పరిస్థితి మరింత దిగజారినప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం కరువు ప్రకటనను మరో వారం రోజులు వాయిదా వేసిందిదని బీజేపీ మరో ట్వీట్‌లో ఆరోపించింది.

The BJP is accusing the Siddaramaiah government of becoming a curse for the people of Karnataka

రైస్ మిల్లులపై భారం, రాష్ట్రంలో కరువు పరిస్థితుల కారణంగా విద్యుత్ ధరల పెరుగుదల కారణంగా కిలో బియ్యం ధర రూ. 10 నుండి రూ. 20 పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని తెలిసి కూడా ఐఎన్‌డీఐ కూటమి మిత్రుల కోసం సిద్ధరామయ్య ప్రభుత్వం చేతులు దులుపుకుని కూర్చోవడం వలనే బియ్యం ధరలు ఆకాశాన్నంటడం మరో కారణమని తేలింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+