లై డిటెక్టర్స్తో చిదంబరం విచారణ...?
ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంకు లై డిటెట్టర్తో పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో గత వారం అరెస్ట్ అయిన చిదంబరం దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే వాదనను తీసుకువస్తున్నాయి.
సీబీఐ అరెస్ట్ తర్వాత నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉన్న చిదంబరం, అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఈ నెల ముప్పై వరకు సీబీఐ కస్టడిలోకి తీసుకుంది.దీంతోపాటు కేసులో ముద్దాయిగా ఉన్నా ఇంద్రాని ముఖర్జీలను ఎదురెదురుగా ఉంచి ప్రశ్నించేందుకు కూడ సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు సుప్రిం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఈడీ అరెస్ట్ చేయకుండా ముందస్తుబెయిల్ కోసం పెట్టుకున్న అప్పిల్పై స్పందించింది. ఈ నేపథ్యంలోనే కేసును విచారణ కొనసాగిస్తోంది. దీంతో ఈడీ అరెస్ట్ నుండి ఆయనకు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు..కాగా గత నెల 21న అరెస్ట్ అయిన చిదంబరం ఈ నెల ముప్పై వరకు సీబీఐ కస్టడీలోనే కొనసాగనున్నారు.