PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు..!
అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేల ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే ప్రధాని మోడీ స్వయంగా దీనికి సంబంధించి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
చిన్న రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని మూడింట ఒక వంతు పెంచే ప్రణాళికను కేంద్రం పరిశీలిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికార పార్టీ ఎన్నికలకు ముందే దీన్ని పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇదే గనక ఆమోదం పొందితే.. కేంద్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం కోసం రూ.60వేల కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.

పీఎం కిసాన్ నిధుల పెంపు విషయంపై స్పందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాను భాసిన్ నిరాకరించారు. దేశంలోని 1.4బిలియన్ల జనాభాలో దాదాపు 65శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తుంటారు. వీరిని ఆకట్టుకునేందుకు పీఎం కిసాన్ పథకంలో అందించే మొత్తాన్ని పెంచే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పీఎం కిసాన్ 15 విడత నవంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో 14 విడతలుగా రూ.28 వేలు జమ అయ్యాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కూడా అమలు చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ. 15 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింప జేస్తాని స్పష్టం చేసింద. అలాగే మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 బోనస్ కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
మోర్ డేంజర్- ఆ వెయిట్ లాస్ డ్రగ్ పై కేంద్రం హెచ్చరిక -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications