సీబీఐ చేతికి ఐఏఎస్ ఆఫీసర్ డికే రవి మృతి కేసు
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును చేపట్టాలని సీబీఐకి కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వూలు జారీ చేసింది. సీబీఐ అధికారులు మంగళవారం నుండి ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని వాణిజ్య పన్నలు విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి డికే రవి మార్చి 16వ తేదిన ఆయన నివాసం ఉంటున్న కోరమంగల సమీపంలోని అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు సీఐడికి అప్పగించింది.

ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన వ్యక్తం చెయ్యడంతో మార్చి 24వ తేదిన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. అయితే కేవలం మూడు నెలలలోపు కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలని ఆయన షరతులు పెట్టారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పలు చోట్ల దర్యాప్తు చేశారు.
మూడు నెలలలోపు డి.కే. రవి కేసు దర్యాప్తు పూర్తి చెయ్యడం తమ వల్ల కాదని సీబీఐ అధికారులు తేల్చి చెప్పారు. తరువాత సిద్దరామయ్య మూడు నెలల షరతును ఉపసంహరించుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం నుండి సీబీఐ అధికారులకు అధికారికంగా ఉత్తర్వూలు అందాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications