"కావేరి నీళ్లు తమిళనాడుకు ఇవ్వలేం"
బెంగళూరు: కావేరి ట్రిబ్యునల్ నిర్ణయించిన నీటిని ఇప్పట్లో తమిళనాడుకు వదిలిపెట్టడానికి వీలు కాదని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాశారు.
కావేరి నీటి పంపిణి విషయంలో కావేరి ట్రిబ్యునల్ ఒక నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి 192 టీఎంసీల నీటిని తమిళనాడుకు వదిలిపెట్టాలని కర్ణాటకకు సూచించింది. కేఆర్ఎస్ రిజర్వాయర్ లో నీరు లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక అంటున్నది.

ఇటీవల మండ్య జిల్లాలో రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సందర్బంలో తమిళనాడు ప్రభుత్వానికి నీరు వదిలిపెడితే లేని పోని సమస్యలు వస్తాయని కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లి కావేరి నీటి విషయంపై రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.
అయితే ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే విషయం వేచిచూడాలి. తమకు రావలసి నీటి వాటా విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితో రాజీపడదనే విషయం గతంలో అనేక సార్లు వెలుగు చూసింది. ఇప్పుడు మళ్లి కావేరి ట్రిబ్యునల్ ను ఆశ్రయించడానికి అవకాశం ఉంది.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications