బుద్దుడి బంగారు పాత్ర చోరీ, ఏడేళ్లు జైలు
కంబోడియా: బౌద్ధ మందిరంలో బంగారు పాత్ర చోరీ చేసిన ఐదు మందిని జైలుకు పంపించారు. కంబోడియా ప్రత్యేక న్యాయస్థానం నిందితులకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
కంబోడియాలోని ఔడంగ్ పర్వతంపై ప్రసిద్ధి చెందిన బౌద్ద మందిరం ఉంది. ఈ మందిరంలో బుద్ధుని పురాతన బంగారు పాత్ర ఉంది. ఇక్కడ పలువురు సెక్యూరిటి సిబ్బందిగా ఉద్యోగాలు చేస్తున్నారు. బౌద్ద మందిరానికి కట్టుదిట్టమైన భద్రత ఉంది.

2013 డిసెంబర్ నెలలో మందిరంలో ఉన్న బుద్దుడి పురాతన బంగారు పాత్ర చోరీ అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది మీద పోలీసులకు అనుమానం వచ్చింది.
చీఫ్ సెక్యూరిటి అధికారితో పాటు నలుగురు సెక్యూరిటి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ ఐదు మంది బంగారు పాత్రను చోరీ చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఒక్కోక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications