ఇన్ స్టా గ్రామ్ బాయ్ ఫ్రెండ్స్ తో వ్యాపారి భార్యకు ?, ఎస్ యూవీ కారులోనే ఆమె !
బెంగళూరు: ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన 37 ఏళ్ల వ్యాపారవేత్త అతని భార్యను ఎస్ యూవీ కారులోనే దారుణంగా హత్య చేసిన షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. సుల్తాన్పూర్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ఇద్దరు పిల్లల ముందే భర్త అతని భార్యను హత్య చేశాడు. సోషల్ మీడియాలో భార్యకు ఫాలోవర్స్ ఎక్కువ అయ్యారని, భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని రగిలిపోయిన వ్యాపారవేత్త అతని భార్యను చంపేసి చేతులు దులుపుకున్నాడు.
15 సంవత్సరాల క్రితం సూరజ్, సలోనికి (ఇద్దరు పేర్లు మార్చడం జరిగింది) వివాహం అయ్యింది. భార్య సలోని సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. మొదట్లో తన భార్య సలోని సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉందని తెలుసుకున్న సూరజ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో తన భార్య సలోనికి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారనే అసూయ సూరజ్ లో రానురాను పెరిగిపోయింది.

కొంతకాలం క్రితం సలోని ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆమె భర్త సూరజ్ అకౌంట్ ను బ్లాక్ చేసింది. దీంతో సలోని భర్త సూరజ్ కు ఆమె మీద అభద్రతా భావం పెరిగింది. నేను లేనప్పుడు సలోనిని ఆమె సోషల్ మీడియా ఫ్రెండ్స్ కొందరు సీక్రేట్ గా తన భార్యను కలుస్తున్నారని సూరజ్ కు తెలిసింది. దీంతో భార్య సలోని మీద ఆమె భర్త సూరజ్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే కారణంగా దంపతుల సంబంధం కొంత కాలంగా క్షీణించిందని, ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
సూరజ్ సొంతంగా టూర్ అండ్ ట్రావెల్ ఏజెన్సీని నిర్వహిస్తూ ప్రతినెల లక్షల రూపాయలు డబ్బులు సంపాధిస్తున్నాడు. సూరజ్ భార్య సలోని గృహిణి. లక్నోలోని పారా ప్రాంతంలో 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడితో కలిసి సలోని, సూరజ్ దంపతులు నివాసం ఉంటున్నారని కురేభార్ పోలీస్ స్టేషన్ అధికారి ప్రవీణ్ కుమార్ యాదవ్ చెప్పారు.

ఉదయం సలోని, సూరజ్ దంపతులు వారి సొంత ఎస్ యూవీ కారులో లక్నో నుంచి రాయ్బరేలీకి బయలుదేరారు. కానీ సూరజ్ అతని కారును పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే వైపు మళ్లించాడు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సుల్తాన్పూర్లోని ముజేష్ ఇంటర్సెక్షన్ సమీపంలో నిందితుడు సూరజ్ హైవేలో రోడ్డు పక్కన అతని కారు నిలిపేసి అతని భార్య సలోని తో అక్రమ సంబంధం విషయంలో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
ఆ సందర్బంలో పిల్లల ముందే సూరజ్, సలోని దంపతులు వాగ్వివాదానికి దిగారు. ఆవేశానికి లోనైన సూరజ్ అతని భార్య సలోనిని కారులోనే చితకబాదేశాడు. తరువాత ఆవేశంతో ఊగిపోయిన సూరజ్ అతని భార్య సలోని గొంతు నులిమి హత్య చేశాడు. ఆ భయానక దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన అతని ఇద్దరు పిల్లలు కారులోనే ఏడ్వడం ప్రారంభించారు.

అనంతరం నిందితుడు సూరజ్ భయపడి రోడ్డు పక్కనే అతని ఎస్యూవీ కారు డోర్ లాక్స్ చేశాడు. అనుమానాస్పదంగా ఆగి ఉన్న ఎస్ యూవీ వాహనాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసుల బృందానికి అనుమానం వచ్చింది. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ తర్వాత ఆ సలోని, సూరజ్ దంపతుల కూతురు తన తల్లి సలోనిని తన తండ్రి సూరజ్ చంపాడనే నిజాన్ని పోలీసుల ముందు బయటపెట్టింది. కూతురు వాంగ్మూలం ఆధారంగా నిందితుడు సూరజ్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి సమాచాం బయటకు చెప్పడం సాధ్యం కాదని పోలీసు అధికారులు అంటున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications