గవర్నర్ ను గాలికి వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయిన విమానం, అసలు మ్యాటర్ !
బెంగళూరు: పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ కు వెళ్లాల్సిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను ఎయిర్ పోర్టులోనే వదిలేసి విమానం వెళ్లిన ఘటన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. జనవరి 27వ తేదీ గురువారం గవర్నర్ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే 10 నిమిషాలు ఆలస్యంగా గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గవర్నర్ ఫ్లైట్ మిస్ అయ్యారు. పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ థావర్ చంద్ గెల్హాట్ ను వదిలేసిన విమానం హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిపోయింది. గవర్నర్ అంటే ఓ రాష్ట్ర ప్రథమ పౌరుడు అనే విషయం విమాన సిబ్బంది మరచిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో తాను అగౌరవంగా భావిస్తున్నానని, నా విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘించబడిందని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

గవర్నర్ను విడిచిపెట్టి ప్రోట్ కాల్ నియమాలు ఉల్లంఘించారని. మర్యాదలను ఉల్లంఘించినందుకు ఎయిర్ఏషియా ఎయిర్లైన్స్పై బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విమానం మిస్ కావడానికి కారణమేమిటని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంలో విచారణ కొనసాగే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications