మర్మాంగాలు కోసేసి, ఇద్దరు యువకులను ఎత్తకెళ్లిన హిజ్రాలు
మీరట్: మత్తులో ఉన్న ఇద్దరు యువకుల మర్మాంగాలు కోసి వేసి ఎత్తుకెళ్లిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో జరిగింది. మర్మాంగాలు కోసి వెయ్యడంతో ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృత్యవుతో పోరాడుతున్నారు.
బుధవారం ఉదయం మీరట్ జిల్లాలోని ఏంచు గ్రామం సమీపంలోని పాంచాలి ఫౌల్ట్రీఫాం దగ్గర ఇద్దరు యువకులు రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించిన గ్రామస్తులు వెంటనే జానీ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితులను శివకాస్ నివాసి షబ్బీర్, జాని ప్రాంతం నివాసి ప్రదీప్లుగాగుర్తించామని పోలీసులు చెప్పారు. బాధితులను విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసిందని పోలీసులు అన్నారు.
మంగళవారం నీలం అనే హిజ్రా రైల్వే స్టేషన్ దగ్గర వీరిద్దరికి టీ ఇచ్చింది. టీ తాగిన షబ్బీర్, ప్రదీప్ మత్తులోకి జారుకుంటున్న సమయంలో నీలం సాటి హిజ్రాలతో కలిసి వీరిద్దరిని పంచాలి ఫౌల్ట్రీ ఫాం దగ్గరకు తీసుకు వచ్చి మర్మాంగాలు కోసి వేశారని బాధితులు చెప్పారని పోలీసులు అంటున్నారు.
నీలం రోడ్ల మీద డ్యాన్స్ లు చేసే సమయంలో షబ్బీర్ డోలు వాయిస్తుంటాడని, నీలంతో పాటు ఉంటున్న సాటి హిజ్రాలకు ప్రదీప్ వంట చేసి పెడుతుంటాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు యువకులను హిజ్రాలుగా తయారు చెయ్యడానికి నీలం ఈ పని చేసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.