వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతల కులమతాల ప్రసంగాలు..! ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సున్నితమైన కులమతాల అంశాన్ని అడ్డుపెట్టుకుని.. అడ్డదిడ్డంగా ప్రసంగాలు చేసే లీడర్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆ రోజుకు వాయిదా వేసింది.

మా ఫ్యామిలీ ప్రధానులు ఏమి చేయలేదు..! మోడీని మించిన PM లేరు : వరుణ్ గాంధీమా ఫ్యామిలీ ప్రధానులు ఏమి చేయలేదు..! మోడీని మించిన PM లేరు : వరుణ్ గాంధీ

రాజకీయ పార్టీలకు చెందిన వివిధ స్థాయి నేతలు, అధికార ప్రతినిధులే టార్గెట్ గా.. షార్జాలో నివసించే హర్‌ప్రీత్‌ మన్సుఖనీ అనే ఎన్నారై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. వారు కులమతాల గురించి ప్రసంగించినా, ఆరోపణలు చేసినా.. కఠిన చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అంతేకాదు కులమతాల ప్రాతిపదికన డిబేట్లు పెట్టే మీడియా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

The Supreme Court judgement on religion and caste notice issued to EC

హర్‌ప్రీత్‌ మన్సుఖనీ పిటిషన్ కు సంబంధించి.. సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్దే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం ఈ పిటిషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.

English summary
The Supreme Court on Monday issued a notice to the Election Commission on a petition seeking action against spokespersons and representatives of parties who deliver speeches or make remarks pertaining to a religion or caste, Bar and Bench reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X