కాసేపట్లో శశికళ అరెస్టు ? 6 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా, ఏం చెద్దాం!
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించిన శశికళను అరెస్టు చేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం (ఈ రోజు ఫిబ్రవరి 14) 6 గంటల తరువాత ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తమిళనాడు పోలీసు వర్గాలు అంటున్నాయి.
మంగళవారం కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళ కాలం గడిపారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారు. గోల్డెన్ బే రిసార్ట్ ను పోలీసులు ఇప్పటికే చుట్టుముట్టారు. మంగళవారం శశికళను అరెస్టు చేసి బుధవారం ఆమెను బెంగళూరు పోలీసులకు అప్పగించాల్సి ఉంది.

శశికళను ఎప్పుడు అరెస్టు చెయ్యాలి, ఎలా తరలించాలి అంటూ తమిళనాడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే అనారోగ్యం కారణంగా తాను కోర్టులో లొంగిపోయేందుకు సమయం కావాలని శశికళ కోరే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఆదాయానికి మించిన ఆక్రమాస్తుల కేసులో శశికళ దోషి అంటూ తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు వెంటనే లొంగిపోవాలని శశికళకు, ఇళవరసి, దివాకరన్ లకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినా ఈ రోజు రాత్రి ఆమెను చెన్నైలోని పెట్టి బుధవారం బెంగళూరు తరలించాలని తమిళనాడు పోలీసు అధికారులు నిర్ణయించారని తెలిసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications