రాంమందిర నిర్మాణంపై మోడీకి లేఖ ..వీహెచ్పీ.. కేసును త్వరగా తేల్చాలంటూ సీజేకు విన్నపం
రామమందిర నిర్మాణంపై ఓవైపు శివసేన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే తాజగా విశ్వహిందు పరిషత్ సైతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే హర్యానాలో సమావేశమైన కేంద్రీయ మార్గదర్శక్ మండలి తీర్మాణాన్ని చేసింది.రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశాలు ముగిసిన అనంతరం రామ మందిరం పునర్నిర్మాణం చేయాలంటూ వీహెపీ తీర్మాణాన్ని చేసింది. కాగా తీర్మాణం కాపీని ప్రధాని నరేంద్ర మోడీకి పంపుతామని తెలిపింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న సుప్రిం కోర్టు చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్కు కూడ కేసును త్వరగా విచారణ చేపట్టి వివాదానికి తెర దించాలని విహ్పీ కోరింది.

2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీలు, శివసేన,విహెచ్పీలు పావులు కదుపుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇటివల అయోధ్య ను సందర్శించిన శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే రామ మందిర నిర్మాణంపై పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.. కాగా ఇదివరకే ఉద్దవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించి రాంమందిర నిర్మాణం చేపట్టాని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు.
ఇందులో భాగంగానే 18మంది ఎంపీల బృందంతో కలిసి రామాలయాన్ని ఉద్దవ్ ఠాక్రే సందర్శించాడు. దీంతో రామమందిర నిర్మాణం చేపట్టాలని ప్రధానమంత్రి మోడీపై ఒత్తిడి తేనున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం రామ మందిర నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. మందిరాన్ని నిర్మించాలని ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తామని అన్నారు. మరోవైపు మహరాష్ట్ర్రలో వచ్చే ఎన్నికలు ఉండడం కూడ శివసేన పావులు కదుపుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications