కోవిడ్ చికిత్సకు ఎయిమ్స్, ఐసీఎంఆర్ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలివే...
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) - కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా కోవిడ్-19 రోగుల చికిత్సకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి
కేసు తీవ్రతను బట్టి వ్యాధిని తేలికపాటి (మైల్డ్), మధ్యస్థ (మోడరేట్), తీవ్రమైన (సీరియస్) కేసులుగా విభజిస్తూ ఒక్కొక్క విభాగానికి మార్గదర్శకాలు అందించారు.
తేలిపాటి కేసు అంటే శ్వాస తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడం. మధ్యస్థం అంటే కోవిడ్ లక్షణాలు ఎక్కువగానే కనిపిస్తూ ఆక్సిజన్ స్థాయి 93% నుంచి 90% ఉండడం. తీవ్రమైన కేసు అంటే వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటూ ఆక్సిజన్ స్థాయి 90% కంటే తక్కువ స్థాయికి పడిపోవడం.
https://twitter.com/COVIDNewsByMIB/status/1385290361270984709
- తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఐసొలేషన్లో ఉంటూ డాక్టరును ఫోన్లో సంప్రదించి మందులు వేసుకోవాలి.
- మోడరేట్ కోవిడ్ ఉన్నవారిని ఆస్పత్రిలో చేర్పించాలి. వారికి ఆక్సిజన్ సపోర్ట్ అందించాలి. రోగికి వ్యాధి లక్షణాలు ముదురుతున్నట్లు అనిపిస్తే వెంటనే చెస్ట్కు సీటీ స్కాన్, ఎక్స్-రే తీయించాలి.
- తీవ్రమైన కేసుల్లో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలి. వారికి రెస్పరేటరీ సపోర్ట్ అందించాలి.
- మోడరేట్, సివియర్ కేసుల్లో రోగులకు పూర్తిగా నయం అయిన తరువాత డిశార్జ్ ప్రమాణాల ఆధారంగా వారిని డిశ్చార్జ్ చేయాలి.
- 60 ఏళ్లు పైబడినవారిలో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. గుండె జబ్బు, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయ, శ్వాసకోస వ్యాధులు ఉన్న వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వీరిలో మరణాల రేటూ అధికంగానే ఉంది.
- రెమిడెసివిర్ ఇంజెక్షన్ను మోడరేట్, సివియర్ కేసుల్లో ఆక్సిజన్ సపోర్ట్ అక్కర్లేనివారికి మాత్రమే అందించాలి.
- ఇంట్లోనే ఐసొలేషన్లో ఉన్న రోగులు ఆక్సిజన్ సపోర్ట్ మీద లేకపోయినా కూడా రెమిడెసివిర్ వాడకూడదని సూచించారు.
- ఐసీయూలో చేర్చిన 24-48 గంటల తరువాత రోగికి అనారోగ్య లక్షణాలు తీవ్రమైపోతూ ఉంటే వారికి టోసిలీజుమాబ్ ఇవ్వాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ కేసుల రికార్డ్: వరుసగా రెండోరోజు 3లక్షలకు పైగా కొత్త కేసులు.. మంత్రి కేటీఆర్కు కరోనా పాజిటివ్
- 'ఇండియా కోవిడ్ వేరియంట్' అంటే ఏమిటి... ఇది వ్యాక్సీన్కు లొంగుతుందా?
- విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్కు 5 సార్లు నామినేట్ అయిన 'భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- నరేంద్ర మోదీ: ''తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)