హిట్ అండ్ రన్ కేసు: యువకుడి అరెస్టు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య మూడుకు చేరిందని పోలీసులు చెప్పారు.
మంగళవారం వేకువ జామున జానీ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో తలదాచుకున్న సోనూ అలియాస్ షహనాజ్ అనే యువకుడిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్ జేడీ శాసన సభ్యుడు మహమ్మద్ సోహర్బ్ కుమారుడు సాంబియా సోహ్రాట్.

శనివారం రాత్రి సాంబియా సోహ్రాట్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. సోనూ, జానీలను కోర్టులో హాజరుపరిచామని, ఇద్దరినీ తమ కష్టడీకి ఇవ్వాలని మనవి చేశామని కోల్ కతా నగర అడిషనల్ పోలీసు కమిషనర్ (క్రైం) దేబశిష్ బొరాల్ తెలిపారు.
సోనూ అలియాస్ సాంబియా సోహ్రాట్ ను ఈనెల 30వ తేది వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు. వైమానిక దళ అధికారి అభిమన్యు గౌడ్ (21) ఈనెల 13వ తేదిన రిపబ్లిక్ డే పెరేడ్ ప్రాక్టీస్ లో పాల్గోని ఇంటికి బయలుదేరారు.
అదే సందర్బంలో సాంబ్రియా సోహ్రాట్, అతని మిత్రులు పీకలదాక మద్యం సేవించి అడీ కారులో బయలుదేరారు. తరువాత వైమానిక దళ అధికారి అభిమన్యు గౌడ్ ను కారుతో డీకొన్నారు. హిట్ అండ్ రన్ కేసులో తీవ్రగాయాలైన అభిమన్యు గౌడ్ మరణించారని పోలీసు అధికారులు తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications