ఇన్కమ్ టాక్స్ పన్ను ఆగష్టు 31లోగా చెల్లించలేదా...ఏం జరుగుతుంతో చూడండి..?
న్యూఢిల్లీ: మీరు మీ ఆదాయపు పన్ను కట్టలేదా..? ఇన్కం టాక్స్ కట్టేందుకు చివరి తేదీ కూడా అయిపోయిందని దిగులు చెందుతున్నారా...? అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ టాక్స్ తర్వాతైనా ఎలా కట్టొచ్చో ఇప్పుడు చూద్దాం....
ఆదాయపు పన్ను చివరితేదీలోగ కట్టేముందు కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మీకు సంబంధించిన తేదీలను తెలుసుకుందాం. ముందుగా జనరల్ కేటగిరీ అంటే జీతాలు లేదా వేతనాలు పొందుతున్న వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేందుకు చివరి తేదీ ఆగష్టు 31. ఒకవేళ మీరు ఏదో పనిమీద కట్టడంలో విఫలమైనా... మీ ఆడిటింగ్ ఆలస్యమైనా సెప్టెంబర్ 30లోపు మీరు మీ పన్నును కట్టొచ్చు. అంతేకాదు ఒక సంస్థలో ఉన్న పార్ట్నర్కు కూడా ఇది వర్తిస్తుంది. సంస్థలో టాక్స్ ఆడిట్ ఇంకా జరగకపోతే సెప్టెంబర్ 30లోగా పన్ను కట్టే అవకాశం ఉంది. ఇక వ్యాపారవేత్తలు వారి వ్యాపారంలో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఉంటుంది కనుక అలాంటి వారికి నవంబర్ 30 పన్నుకట్టేందుకు చివరితేదీ.

ఆదాయపు పన్నుకట్టేందుకు మీకిచ్చిన గడువు ఆగష్టు 31. ఈలోగా మీరు పన్నుకట్టకపోతే మార్చి 31,2019లోగా పన్ను కట్టే అవకాశం ఇంకా మీకుంది. మార్చి 31 తర్వాత మీరు పన్ను కట్టే అవకాశం కోల్పోయి చట్టపరంగా చర్యలు తీసుకోబడుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీరు చేస్తున్న వ్యాపారాల్లో భారీ నష్టం వచ్చి మీరు ఆదాయపు పన్ను కట్టలేకపోతే... ఆ తర్వాత సంవత్సరాల్లో వచ్చే లాభాల్లో కడదామనుకుంటే అది చెల్లదు. ఆ సంవత్సరానికి సెపరేటుగానే పన్నుకట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదాయపు పన్ను నుంచి మీకు టాక్స్ రీఫండ్ జరిగితే..మీరు పన్ను కట్టడంలో ఆలస్యం చేసినందుకు దానిపై వచ్చే వడ్డీని మీరు కోల్పోతారు.
ఒకవేళ ఆగష్టు 31న మీరు టాక్స్ కట్టకపోతే ఆ తర్వాత ఎప్పుడైతే కడతారో అప్పుడు ఫైన్తో కలిపి కట్టాల్సి ఉంటుంది. ఆలస్యంగా కట్టినందుకు కట్టాల్సిన జరిమానా డబ్బు మొత్తం ఆదాయం, చివరిగా ఎప్పుడు పన్ను కట్టావనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆగష్టు 31న కట్టాల్సిన పన్నును మీరు డిసెంబర్ 31న చెల్లించారునుకుందాం... అప్పుడు ఆలస్యంగా కట్టినందుకు జరిమానా రూ.5వేలు కట్టాల్సి ఉంటుంది. ఈ డెడ్లైన్ లోగా కూడా మీరు పన్ను కట్టడంలో విఫలమైతే జరిమానా రూ. 10వేలకు పెరుగుతుంది. అయితే చిన్నమొత్తంలో పన్ను కట్టే వారు అంటే ఏడాదికి రూ.5లక్షల ఆదాయం ఉన్నవారు మాత్రం జరిమాన రూ.1000 మాత్రమే ఉంటుంది.
ఒకవేళ మీ ఇన్కంటాక్స్ రిటర్న్స్ మార్చి 31లోగా కూడా ఫైల్ చేయలేదంటే... లేదా మార్చి 31నే మీరు టాక్స్ కట్టారంటే...ఆదాయపు పన్ను శాఖ 50శాతం పెనాల్టీ విధించే అవకాశం ఉంది. రూ.3వేల కంటే పన్ను ఎక్కువగా కట్టాల్సి వచ్చి చివరితేదీలోగా కట్టలేదంటే ఆదాయపుశాఖ పన్నుఎగవేత కింద మిమ్మలను విచారణ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మీకు రెండు నుంచి ఏడేళ్ల పాటు జైలుశిక్ష ఉంటుంది. అది కూడా మీరు పన్ను ఎంత ఎగవేశారో అనేదానిపై ఆధారపడి ఉంటుంది.
సో... ఇలాంటి కష్టాలన్నీ వద్దనుకుంటే ఇచ్చిన గడువులోపు మీ ఆదాయపు పన్ను కడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications