పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్
చెన్నై: బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మూడు బోగీలలోని ప్రయాణికులు దేవుడా అంటు ఊపిరిపీల్చుకుని రైలు దిగారు. రైలు బయలుదేరడం ఆలస్యం అయినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
బుధవారం వేకువ జామున 4.25 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బెంగళూరు-చెన్నయ్ ఎక్సె ప్రెస్ రైలు బయలుదేరింది. రైలు బయలుదేరి రెండు కిలో మీటర్ల దూరం వెళ్లింది. తరువాత రైలు క్రాసింగ్ కోసం చిన్నగా వెళుతున్నది.

బేసిన్ బ్రిడ్జ్ సమీపంలోని చిన్న మలుపులో రైలు చివరి మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లిపోయాయి. ఆ సమయంలో రైలు వేగం చాల తక్కువగా ఉండటంతో వెంటనే అప్రమత్తం అయిన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. ఆందోళన చెందిన ప్రయాణికులు కిందకు దిగారు.
విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్లి పట్టాల మీదకు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదం వలన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్లు, అక్కడికి చేరుకునే రైళ్ల సంచారంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications