వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగతనం నెపంతో మహిళపై రేప్, చిత్రహింసలు

|
Google Oneindia TeluguNews

Three held in Bengal over alleged rape, torture
కోల్‌కతా: ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళపై ఆ ఇంటి యజమాని అత్యాచారానికి పాల్పడగా.. మరో ఇద్దరు మహిళలు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిన గాయాలతో బాధితురాలు ఆదివారం ఆస్పత్రిపాలు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాధిత మహిళ(32) తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనం నేరం మోపిన ఆమె ఇంటి యజమాని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లోని ఇద్దరు మహిళలు ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు విచారణాధికారి ఎస్ బందోపాధ్యాయ్ మంగళవారం మీడియాకు తెలిపారు.

మండుతున్న ఓ ఇనుప కడ్డీతో తనపై యజమాని కుటుంబసభ్యులు వాతలు పెట్టారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

తాను యజమాని ఇంట్లో నగదు గానీ, చేతి గడియారం గానీ దొంగతనం చేయలేదని బాధితురాలు వాపోయింది. ఎలాంటి దొంగతనం చేయనప్పటికీ తనపై నేరంమోపి యజమాని కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేయగా.. తన యజమాని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది.

English summary
Three people, including two women, were arrested Tuesday in West Bengal's Howrah district after a woman who worked as a maid in their house alleged she was raped and tortured, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X